తన పన్నెండు మందినీ పిలిచి, వారు ఇద్దరిద్దరుగా పట్టణాల్లోకి గ్రామాల్లోకి వెళ్లాల్సిందిగా యేసు ఆదేశించాడు. ఒంటరిగా ఎవర్నీ పంపలేదు. సహోదరుణ్ని సహోదరుడితో, మిత్రుణ్ని మిత్రుడితో పంపాడు. ఇలా వారు ఒకరికొకరు సహాయం, ప్రోత్సాహం, హితవు అందించుకుని కలిసి ప్రార్ధించవచ్చు. ప్రతీవారి బలం ఇతరుల బలహీనతను పూరించవచ్చు. అలాగే తర్వాత డెబ్బయి మందిని పంపించాడు. సువార్త దూతలు ఈ విధంగా సహవాసం చెయ్యాలన్నది రక్షకుని ఉద్దేశం. మన దినాల్లో ఈ మాదిరిని నమ్మకంగా అనుసరించినట్లయితే సువార్త సేవ మరింత విజయవంతమౌతుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 350. ChSTel 147.3